: అచ్చెన్నాయుడు
గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంస చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన తెలిపిన వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తారా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో నీ తండ్రి విగ్రహాలు తప్ప మహానుభావులవి ఉండకూడదా అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ధ్వంసానికి పాల్పడి, మారణాయుధాలతో ప్రజలను భయపెట్టిన వారిపై ఐపీసీ 294, 427 లాంటి నామమాత్రపు కేసులు పెట్టారన్నారు. హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ వారిపై పెట్టిన కేసులను తక్షణమే పోలీసులు వెనక్కి తీసుకుని, అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారన్నారు. మరోసారి ఎన్టీఆర్ విగ్రహాల జోలికివస్తే ఊరుకునేది లేదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.