బొండా ఉమ
సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును హత్య చేయటానికి ప్లాన్ చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భీమవరం వచ్చుంటే ఆయనకు అదే చివరి రోజు అయ్యేదని అన్నారు. రఘురామకు బేగంపేటలో రైలు దాడి సమాచారం రాగానే దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారని, ఇది నిజం కాదని వైసీపీ అంటే.. సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు తెలుస్తాయన్నారు. ప్రధాని మోదీ ఏపీ వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారంటే.. జగన్ పాలన ఎలా ఉందో అర్థమైందన్నారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సత్తనపల్లి రైల్వేస్టేషన్ పుటేజ్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మొన్న సతెనపల్లిలో 100 మంది గుండాలతో.. రఘురామ ప్రయాణం చేస్తున్న బోగిని తగలపెట్టి చంపాలని ప్లాన్ చేశారన్నారు. వైసీపీకి చిత్త శుద్ది ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు.