ఏపీలో గడచిన 24 గంటల్లో 61,298 మంది నమూనాలు పరీక్షించగా, కొత్తగా 1,540 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక గడచిన 24 గంటల్లో కరోనాతో 19 మంది మరణించారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 2,304 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 20,965 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది.