Friday, April 26, 2024
Friday, April 26, 2024

రోశయ్యకు నివాళి ఘటించడానికి కూడా సీఎం జగన్‌కు మనసు రాలేదు

: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వ వేధింపులతో అంతటా రౌడీరాజ్యం అమలవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారని కొనియాడారు. ఆర్థిక మంత్రి అంటే రోశయ్య పేరు గుర్తుకు వస్తుందన్నారు. రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో ఆయన పేరు ఎందుకు పెట్టరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. రోశయ్యకు నివాళి ఘటించడానికి కూడా సీఎం జగన్‌కు మనసు రాలేదని తప్పుబట్టారు. మాజీ సీఎంలు వెంగళరావు, విజయభాస్కర్‌రెడ్డి, చెన్నారెడ్డి చనిపోతే ప్రభుత్వ సంస్థలకు వారి పేరు పెట్టి గౌరవించామని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొణిజేటి రోశయ్యకు తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img