Friday, April 26, 2024
Friday, April 26, 2024

విశాఖలో రాజధాని ఎప్పుడైనా ఏర్పాటు కావొచ్చు: సజ్జల

విశాఖలో రాజధాని ఎప్పుడైనా ఏర్పాటు కావొచ్చు అని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని సజ్జల రామకృష్ణ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి సీఎం జగన్మోహన్‌ రెడ్డి న్యాయకత్వంలో ఇలాగే కొనసాగాలని స్వామివారిని ప్రార్ధించానన్నారు. దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా నడుస్తుందని.. అంతే కాకుండా ఆదర్శవంతంగా ఏపీ రాష్ట్రం ఉందని వివరించారు. ఏపీలో జరుగుతున్న యజ్ఞాన్ని.. విష శక్తులు, రాక్షస దూతలు కుట్ర పూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వాటిని ఎదుర్కొనే శక్తిని జగన్‌కు ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. జగన్‌కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img