Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీఎం జగన్‌..ఆ మాట గట్టిగా చెప్పడం వాస్తవమే

మంత్రి బొత్స క్లారిటీ
గడప, గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన సమావేశంపై స్పందించారు. పార్టీ పరంగా రివ్యూ చేసి లోటుపాట్లను చెప్పినట్లు మంత్రి వివరించారు. వారసులు పోటీ చేయంపైనా బొత్స స్పందించారు. 175 స్థానాలు గెలవాలనుకోవటం అత్యాశ కాదన్నారు. ఒక్క స్థానం పోయినా ఫర్వాలేదు అనుకుంటే ఆ సంఖ్య 10 అవుతుందని వ్యాఖ్యానించారు. శాఖాపరమైన సమీక్షలు జరిపినట్లే.. పార్టీ పరంగా సీఎం జగన్‌ ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి లోటు పాట్లు చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వారసుల ఎంట్రీపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. వారసులు అందరికీ ఉంటారని.. తనకూ కుమారుడు ఉన్నారని గుర్తు చేశారు. ఎవరైనా వారసుల్ని ఎన్నికల బరిలోకి దింపొచ్చు.. కానీ ప్రజలు ఆమోదించాలి కదా అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమన్నారు బొత్స. గడప గడపకూ ఎమ్మెల్యేలంతా వెళ్లాల్సిందేనని సీఎం జగన్‌ గట్టిగా చెప్పిన మాట వాస్తవమేనన్నారు. వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడు ఎన్నికపై తనకు సమాచారం లేదని.. తమ పార్టీ విషయాలు తాము మాట్లాడుకుంటామన్నారు. అవి మీడియాకు అనవసరమని.. ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపేనని.. అదే విషయం ముఖ్యమంత్రి అందరికీ గట్టిగా చెప్పారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img