Friday, April 26, 2024
Friday, April 26, 2024

హిందూపురంలో అఖిలపక్షం బంద్‌

అఖిలపక్షం పిలుపు మేరకు హిందూపురంలో బంద్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రెండు జిల్లాలుగా విడిపోనుంది. అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయంపై హిందూపురం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.హిందూపురంను సత్యసాయి జిల్లా కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంపై తమకు అభ్యంతరం లేదని అయితే, జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని పట్టణవాసులు కోరుతున్నారు.ఈ నేపథ్యంలో హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. స్థానిక బస్టాండ్‌లో అఖిలపక్ష నాయకులు బస్సులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో భజరంగ్‌దళ్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img