గన్నవరం విమానాశ్రయానికి కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఢల్లీి ఎయిర్ ఇండియా విమానం నుంచి గన్నవరం విమానాశ్రయానికి 2,88,000 టీకా డోసులు చేరుకున్నాయి. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.