Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

8 గంటలు ఎందుకు పనిచేయరు?…ఉపాధ్యాయులను నిలదీసిన మంత్రి బొత్స

డిమాండ్లతో సచివాలయంలో బొత్సను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
అనుకున్నవన్నీ కావాలని డిమాండ్‌ చేస్తున్న ఉపాధ్యాయులు… ప్రభుత్వం కోరుతున్నట్లుగా 8 గంటల పాటు ఎందుకు పనిచేయరని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారిని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో తమ డిమాండ్లతో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు తనను కలిసిన సందర్భంగా మంత్రి బొత్స వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోరణితో డిమాండ్లను సాధించుకునేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. బెదిరిస్తే పనులు కావని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్నవన్నీ కావాలంటే ఎలాగంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఉపాధ్యాయులు 8 గంటలు ఎందుకు పనిచేయరని మంత్రి ఉపాధ్యాయ సంఘాలను నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img