Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

అందరూ కలిసి పోరాడినా..వైసీపీకి భారీ మెజారిటీ వస్తుంది : సజ్జల

ఓటర్ల గురించి జనరల్‌ ఎన్నికల మాదిరిగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యక్తిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా భరించినందుకు బాధ కలుగుతుందన్నారు. టీడీపీ, జనసేన ఒకే తాను గుడ్డలని, అందరూ కలిసి పోరాడిన వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి చంద్రబాబు చేతుల్లో కుప్పం మగ్గిపోయిందని.. బయట ఓటర్లను తీసుకొచ్చిన అలవాటు చంద్రబాబుకు ఉందన్నారు.జగన్‌ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా అభివృద్ధిని ప్రజలంతా చూస్తున్నారని.. స్థానిక ఫలితాలే కుప్పం టౌన్‌లో రిపీట్‌ అయ్యే అవకాశం ఉందన్నారు. పోలింగ్‌ బూత్‌లో మీ ఏజెంట్‌లు ఉన్నప్పుడు దొంగ ఓట్లు ఎలా వేస్తారు? అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img