: అచ్చెన్నాయుడు
ఏపీలో టీడీపీ ఉండకూడదని జగన్రెడ్డి ప్రయత్నాలు చేశారని, జగన్రెడ్డి నాన్న, తాత ముత్తాతలు కూడా టీడీపీని ఏం చేయలేకపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఓటీఎస్ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితమవుతుందని అన్నారు.