Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఆకాశంలో విహరిస్తే వరద బాధితుల కష్టాలెలా తెలుస్తాయి : చంద్రబాబు

సీఎం జగన్‌ ఆకాశంలో విహరిస్తే వరద బాధితుల కష్టాలెలా తెలుస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. భారీ వర్షాలకు నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. భారీ వర్షాలకు జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షలివ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరపున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఆర్థికసాయాన్ని చంద్రబాబు అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img