Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఏపీలో 429 కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 429 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాకేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,53,192 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,029 కు చేరింది.ఒకరోజులో 1,149 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 9,753 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img