కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనుమతి వచ్చిన కర్నూలులో హైకోర్టు రాబోతుందని అన్నారు. ఓర్వకల్లో మల్లికార్జున రిజర్వాయర్ ఏర్పాటుకు సీఎం జగన్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు.