కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక, ఉద్యోగ, ప్రజా, వామపక్ష సంఘాలు కదంతొక్కాయి. నేడు, రేపు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా… సోమవారం విజయవాడ వన్టౌన్ రథం సెంటర్ నుండి బీసెంట్ రోడ్డు లెనిన్ సెంటర్ వరకూ వివిధ కార్మిక, ప్రజా సంఘాలు భారీ ఎత్తున మహా ప్రదర్శన చేపట్టాయి. విజయవాడ రోడ్లన్నీ ఎర్రజెండాలతో నిండిపోయాయి. దారిపోడవునా కార్మికులకు స్థానిక ప్రజలు సంఫీుభావం తెలిపారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తణుకులో బైక్ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు, విజయనగరం, అనంతపురం, తిరుపతి తదితర నగరాల్లో కార్మికులు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.