మంత్రి అవంతి శ్రీనివాసరావు
ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. లేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని మంత్రి అవంతి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. గంజాయి వ్యవహారం ఇప్పటిది కాదని, 1970లో గంజాయి మొదటి కేసు నమోదు అయిందని తెలిపారు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు గంటా, అయ్యన్న ఒక్కసారి అయిన ఏజెన్సీ వెళ్ళారా అని ప్రశ్నించారు. గంజాయి డాన్ అయ్యన్నను ప్రక్కన పెట్టుకొని చంద్రబాబు గంజాయి కోసం మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అశాంతి, అలజడిని సృష్టిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి డిమాండ్ చేశారు.