Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా : సజ్జల

చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు. ఈ సదర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సంయమనం పాటించాలని చెప్పారని, అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారని అన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఆయన దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదని అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బాబు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ఇలాంటివే ఎదురవుతాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img