Monday, May 6, 2024
Monday, May 6, 2024

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తుది తీర్పు వాయిదా

అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తుది తీర్పును సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ రెండు పిటిషన్‌లపై ఒకేసారి తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడిరచింది.సెప్టెంబర్‌ 15న ఇరు పిటిషన్లపై తీర్పులు ఇస్తామని పేర్కొంది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తికాగా, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఈరోజు వాదనలు ముగిసాయి. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌, సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్లపై సెప్టెంబర్‌ 15వ తేదీన ఒకేసారి తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img