Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం..

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
ఏపీలో టెన్త్‌ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడిరచారు. ఇప్పటికే కరోనా కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు నడిపిస్తున్నామని అన్నారు. ప్రతి మండలానికి 2 లేదా 3 జూనియర్‌ కళాశాలలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే తరంలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పేద పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అందులో భాగంగా ఫౌండేషన్‌ పద్ధతిని ప్రారంభించారని మంత్రి సురేష్‌ వెల్లడిరచారు. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్‌ కూడా మూతపడదని.. ఏ ఒక్క టీచర్‌ ఉద్యోగం పోదని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img