దేశ ఐక్యత స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటించారు. ఉక్కు సంకల్పంతో స్వతంత్ర భారతాన్ని ఐక్యంగా ఉంచిన మహనీయులు పటేల్ అని కొనియాడారు. జనసేన పార్టీ వల్లభాయ్ పటేల్ లాంటి వారి అడుగు జాడల్లో ముందుకు సాగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.