టీడీపీ నేత నారా లోకేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్మాది దాడిలో మృతి చెందిన రమ్య కుటుంబసభ్యులను పరామర్శకు వెళ్లిన సందర్భంలో అరెస్టు చేశారు. లోకేష్తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. పరమయ్యగుంటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నినాదాలు చేశారు. ఉద్రిక్తల మధ్య లోకేశ్ను అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొందరు టీడీపీ నేతలను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. పరామర్శకు వెళ్లిన నేతలపై అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు లోకేష్, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ్ల నరేంద్రపై పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉందన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే పోలీసుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. హత్యకు గురైన దళిత విద్యార్ధిని రమ్యకు రూ. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.