Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదు : సీఎం జగన్‌

విద్యార్థులు.. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అందుకే పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలుచేస్తున్నామని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న విద్యా దివేన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను సీఎం విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లువిడుదల చేశారు.ు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‘పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఎవరికీ పేదరికం అడ్డుకాకూడదు. అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ మంచి చేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తున్నాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు..‘మన లక్ష్యం 100 శాతం అక్షరాస్యత మాత్రమే కాదు, 100 శాతం పిల్లల్ని గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా’ అని పేర్కొన్నారు. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగేలా ఈఏడాది 3వ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.686 కోట్లు విడుదల చేశాం’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img