Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రత్యేక హోదాపై చర్చించాలి : విజయసాయి రెడ్డి


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో తక్షణమే చర్చ చేపట్టాలని సభా నియమ నిబంధనలలోని రూల్‌ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు.రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్‌ 267 కింద ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలను ప్రకటించారని, అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనదని నోటీసులో వివరించారు. ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్‌ చేసి సభలో వెంటనే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని నోటీసులో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img