Monday, May 6, 2024
Monday, May 6, 2024

ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ

ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది.14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్‌, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ.కాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 8 వరకు, పరిషత్‌ ఎన్నికలు: ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్‌ జరగనుంది. ఈ నెల 16న పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్‌ జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img