రాజధాని పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ల నేతృత్వంలో రాజధాని పై విచారించారు. రాజధాని తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదంటూ ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్లను న్యాయవాదులు వేసిన విషయం తెలిసిందే. గతంలో స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించిన నేపద్యంలో ,ప్రభుత్వం తరపున న్యాయవాదులు స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశారు.. విచారణ అనంతరం న్యాయస్దానం కేసును ఆగష్టు 23కు వాయిదా వేసింది.