ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115మందికి కరోనా పాజిటివ్గా తెలింది. కరోనా బారిన పడి19 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,857 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,265 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 19లక్షల 85 వేల 566 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం14,693యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,66,29,314 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.