విశాలాంధ్ర/హైదరాబాద్: ముంబైలో అత్యంత ప్రాచుర్యం పొందిన జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నేడు హైదరాబాద్లో తమ క్లీనిక్ను ప్రారంభించినట్లు వెల్లడిరచింది. హైదరాబాద్లో ఫంక్షనల్ న్యూరో సర్జరీ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఫంక్షనల్ న్యూరోసర్జరీ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో అపారమైన అనుభవం కలిగిన జస్లోక్ హాస్పిటల్ మెరుగైన చికిత్సనందించే రీతిలో ఈ క్లీనిక్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వహించనుంది. జస్లోక్ హాస్పిటల్లో ఫంక్షనల్ న్యూరోసర్జరీ ఫౌండర్, డైరెక్టర్గా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డాక్టర్ పరేష్ దోషి అత్యద్భుతమైన బృందాన్ని ఈ చికిత్సల పరంగా తీర్చిదిద్దారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రోగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాల్సీ (పీఎస్పీ)సిండ్రోమ్తో బాధపడుతున్న రోగికి డీబీఎస్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన డాక్టర్ పరేష్ దోషి మెదడులోపల ఎలక్టోడ్ర్లను అమర్చారు.