హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గాడ్ ఫాదర్’ తొలి విడత చిత్రీకరణ బుధవారం ఊటీలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. మెగాస్టార్ 153వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ నిర్మించనుండగా, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ సహ నిర్మాణ బాధ్యతలను చూస్తోంది. థమన్ స్వరాలను అందించనున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, మెగాస్టార్ సినిమా ప్రస్థానం మొదలైన సెప్టెంబర్ 22నే గాడ్ ఫాదర్ షూటింగ్ను మొదలుపెట్టడం విశేషం.