హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి జంటగా కనిపిస్తూ చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 11న విడుదల కానుండగా…గురువారం సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్కు మంచి స్పందన వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ని విడుదల చేశాడు. ట్రైలర్ని యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా కట్ చేశారు. తమిళ్ హిట్ చిత్రం ‘వేదాళం’కి ఇది రీమేక్. గ్యాంగ్స్టర్ అయిన చిరంజీవి, తన చెల్లిని తీసుకోని కోల్కత్తా వస్తాడు. అక్కడ ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ గా జీవిస్తూ… తను పెంపుడు చెల్లి అమ్మానాన్నల చావుకి కారణమైన వారి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో అమ్మాయిలని కిడ్నాప్ చేసే మాఫియాతో చిరంజీవి ఫైట్ చేస్తాడు. ఈ కథని దర్శకుడు మెహర్ రమేష్ కామెడీ అండ్ కమర్షియల్ గా తెరకెక్కించాడు. ఇక ఈ ట్రైలర్లో హీరోయిన్ తమన్నా… ‘రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు’ అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఈ సినిమాలో చిరు… పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎంటర్టైన్ చేయబోతున్నాడు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.