Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తెలంగాణ పల్లె కథ బలగం

హైదరాబాద్‌: ప్రియదర్శి-కావ్య జంటగా రూపొందిన సినిమానే ‘బలగం’. దిల్‌ రాజు ప్రొడక్షన్లో హర్షిత్‌ రెడ్డి-హన్షిత నిర్మించిన ఈ సినిమాకి, వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. భీమ్స్‌ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా నుంచి ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఇది తెలంగాణ ప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ, హీరో బాకీతో ముడిపడిన అతని నిశ్చితార్థం… ఆయన టెన్షన్‌ పడటం వంటి సన్నివేశాలపై కట్‌ చేసిన ట్రైలర్‌ ఆకట్టుకుం టోంది. పల్లె అందాలు… అక్కడి మనుషుల ఆత్మీయత… వాళ్ల మాట తీరును ప్రతిబింబించేదిగా ఈ ట్రైలర్‌ కనిపిస్తోంది. ఇంతవరకూ తన బ్యానర్లో వచ్చిన చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని దిల్‌ రాజు చెప్పడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img