Friday, April 19, 2024
Friday, April 19, 2024

నీతి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా…: సీఎం కేసీఆర్‌

నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశామని తెలిపారు. మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్ల గ్రాంట్‌, మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందని తెలిపారు. నీతి ఆయోగ్‌ సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామని తెలిపారు. చెబితే విని అమలు చేసే సంస్కారం ఆనాటి ప్రధానులకు ఉండేదని, లేఖ ద్వారా తమ నిరసనను ప్రధానికి తెలియజేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. అన్ని రంగాల్లో దేశం సర్వ నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం ముందు దేశం పరువు పోతోందని వ్యాఖ్యానించారు. నేతి బీర కాయలో నెయ్యి ఎంత ఉంటదో.. నీతి ఆయోగ్‌ లో నీతి అంత ఉందని అన్నారు.
దేశంలో అంతు లేకుండా విద్వేషం పెరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అనేక ధర్నాలు జరిగాయని.. ఆ సందర్భాల్లో పరిష్కారాలు కూడా వచ్చాయని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు 13 నెలలు ధర్నా చేశారని.. దాదాపు 7 వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ప్రధాని మోదీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పారు.. 13 నెలల తర్వాత వచ్చి క్షమాపణ చెప్పారని వివరించారు. అదేదో 13 రోజుల్లో కూడా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఇచ్చిన ఏ హామీలను ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చలేదని ఫైర్‌ అయ్యారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి.. పెట్టుబడి రెట్టింపు చేశారని ఆరోపించారు.ఇవన్నీ జరుగుతుంటే.. నీతి ఆయోగ్‌ ఏం చేసిందని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆఖరికి దేశ రాజధాని ఢల్లీిలోనూ తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ సమస్య, లక్షల కోట్ల పెట్టుబడులు దేశం నుంచి తరలి పోతున్నాయని కామెంట్‌ చేశారు. చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేసే దౌర్బాగ్యం నెలకొందన్నారు. బీడీ కార్మికుల మీద పన్నులు వేయడంతో.. వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. జీడీపీ పతనం ఘోరంగా ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని.. రూపాయి పాతాళంలోకి పడిపోయిందని స్పష్టం చేశారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ లేవన్నారు.
అసలు నీతి ఆయోగ్‌ సాధించింది ఏంటీ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ప్లానింగ్‌ కమిషన్‌ ను మార్చి వచ్చిన నీతి ఆయోగ్‌.. మరింత దారుణంగా పరిస్థితులు దిగజారేలా చేసిందని కేసీఆర్‌ ఆరోపించారు. నీతి ఆయోగ్‌ ఏమన్నా ప్రతిపాదన చేస్తే.. కనీసం పట్టించుకున్న పరిస్థితులు లేవన్నారు. ప్లానింగ్‌ కమిషనే కొంచెం బాగా పనిచేసేందని వివరించారు. ప్లానింగ్‌ కమిషన్‌ పై గౌరవం ఉండేదని.. కానీ.. ఇవాళ నీతిఆయోగ్‌ పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. మిషన్‌ కాకతీయకు 5 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేశారు.. మిషన్‌ భగీరథపై పరిశోధనలు చేసి.. ఇది మంచి ప్రోగ్రాం అని చెప్పారు.. దీనికి 19 వేల కోట్లు.. రెండిరటికి కలిపి 24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేశారని కేసీఆర్‌ వివరించారు. ఆఖరికి నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసి.. ఐదేళ్లు గడిచాయి.. ఇప్పటివరకు 24 పైసలు కూడా రాలేదని కేసీఆర్‌ వివరించారు. దేశంలో అత్యున్నత కమిటీ చేసిన సిఫార్సులు కూడా బుట్టదాఖలు అయితే.. ఎలా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. ఇంత దరిద్రంగా పనితీరు ఉంటే ఎలా అని నిలదీశారు. ఇంత విశాలమైన దేశంలో.. భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న దేశంలో ఇలానేనా వ్యవహరించేది అని కేసీఆర్‌ ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ కు అనుబంధంగా కొన్ని కమిటీలు వేయాలని చెప్పామని.. సమగ్రమైన ధృక్పథంతో ఆలోచించాలని సూచించామని.. కేంద్రం నిధులు రాష్ట్రాలకు కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్టు కేసీఆర్‌ వెల్లడిరచారు. అయినా కేంద్రం మారడం లేదని కేసీఆర్‌ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img