ఉక్రెయిన్`రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కీలక సూచన చేసింది. ఉక్రెయిన్లోని భారతీయులు వెంటనే స్వదేశం రావాలంటూ ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్కు అనవసర ప్రయాణాలు కూడా మానుకోవాలని ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీగా సైన్యాన్ని మోహరించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్య్టా సురక్షితం కాదని ఈ మేరకు భారత్ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం.