గుజరాత్లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో… కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మకు బదులు మోదీ బొమ్మను ప్రింట్ చేయాలని ఆర్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశిస్తారేమో అని ఎద్దేవా చేశారు.