Friday, April 26, 2024
Friday, April 26, 2024

చంద్రబాబుకు, ఔరంగజేబుకు తేడా లేదు..: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. కుప్పంకు నాన్‌ లోకల్‌ అయిన చంద్రబాబు లోకల్‌గా చేసిందేమీ లేదని అన్నారు.
ఇవాళ అసెంబ్లీలో నారాయణ స్వామి మాట్లాడారు. కుప్పంలో వైసీపీ 60 శాతం ఓట్లతో గెలుస్తుందని చెప్పారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్‌ కుప్పంకు వస్తున్నారని… ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని… దానికి కుప్పం నుంచే నాంది పలుకుతామని చెప్పారు. ఎప్పుడైనా పేదల అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశావా అంటూ ప్రశ్నించారు. కుప్పం ఎప్పుడొచ్చినా చంద్రబాబు రచ్చ రచ్చ చేస్తాడని అన్నారు. ‘‘చంద్రబాబు, ఔరంగ జేబు ఒక్కటే. ఔరంగ జేబు తండ్రిని జైలులో పెట్టించాడు. ఇప్పుడు చంద్రబాబు మామను వెన్ను పోటు పొడిచాడు. నీ తమ్ముడుని మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశావ్‌. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. కుల, మతాలను రెచ్చగొట్టే వ్యక్తి. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని మమ్మల్ని సవాల్‌ విసరడం కాదు. జడ్‌ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు బయటికి రాగలవా?’ అని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా గలాటాలు, రచ్చలే ఉంటాయని అన్నారు. కోర్టుల్లోని జడ్జిలు కూడా రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు గౌరవించాలనేది తన విన్నపమని చెప్పారు. మద్యంపై నడిచింది టీడీపీ ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వం కాదని అన్నారు. మద్యంపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు.తప్పుడు మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img