Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తుది శ్వాస వరకు సత్యం కోసం పోరాడుతా…

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వీడియో ట్వీట్‌..
పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియోను సిద్ధు షేర్‌ చేశారు. ఈ వీడియోలో సిద్ధూ ప్రతిపక్షాలను కూడా టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. తన చివరి శ్వాస వరకు సత్యం కోసం పోరాడుతూనే ఉంటానని వెల్లడిరచారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత గొడవలు లేవని, 17 ఏళ్ల నా రాజకీయ ప్రయాణం ఒక లక్ష్యం కోసం జరిగిందని పేర్కొన్నారు. పంజాబ్‌ ప్రజల జీవితాలను మెరుగుపరచడం, సామాన్యుల సమస్యల కోసం పోరాటం చేయడం.. ఈ రోజు వరకు తాను ఎవరితోనూ వ్యక్తిగత పోరాటం చేయలేదన్నారు.‘నేను హైకమాండ్‌ను తప్పుదోవ పట్టించలేను..అలా అని తప్పుదోవ పట్టించేవారిని కూడా ఉపేక్షించను.’అని పేర్కొన్నారు. తాను పంజాబ్‌ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, న్యాయం కోసం పోరాడటానికి ఏ త్యాగానికైనా సిద్ధమని వీడియోలో వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img