Friday, May 3, 2024
Friday, May 3, 2024

దేశంలో కొత్తగా 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు


దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజా కేసులతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,42,85,814 చేరింది. కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 251 మంది మృతి చెందగా..మొత్తం మృతుల సంఖ్య 4,58,437 చేరింది. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు. ఇక దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,06,31,24,205 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img