కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకూ 3వేల లోపు నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం ఆ సంఖ్య 4వేలకు దాటింది. కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది. 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి.