Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 5,335 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 5,335 కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజుకంటే ఇది ఇరవై శాతం అధికం. గత ఏడాది సెప్టంబర్ తరువాత భారత్‌లో రోజువారి కేసుల సంఖ్య 5 వేల మార్కు దాటడం ఇదే తొలిసారి. కరోనా వ్యాప్తి తీవ్రతను సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 3.32గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.06 శాతం కాగా రివవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇక గత 24 గంటల్లో 2826 మంది కరోనా నుంచి బయటపడ్డట్ట కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,41,82,538.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img