Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 5,921 కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖంపడుతోంది. గడిచిన 24 గంటల్లో 5,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,57,477కి చేరింది. మహమ్మారి కారణంగా నిన్న 289 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,14,878 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.63 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 63,878 (0.15%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో దేశం మొత్తం 11,651 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,78,721 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.65 శాతానికిపైగా ఉంది.ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,78,55,66,940 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. నిన్న 21 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. వీరితో కలిపి 178,0263,222 డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img