Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 648 మంది మహమ్మారి కారణంగా మరణించారు. తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366కు పెరగ్గా.. ఇందులో 3,17,54,281 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 4,35,758 మంది మృత్యువాతపడ్డారు. కాగా నిన్న ఒకే రోజు 17,92,755 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పేర్కొంది. ఇప్పటి వరకు 51,11,84,547 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img