దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,662 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. ఇందులో 3,40,639 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడిచిన 24 గంటల్లో 33,798 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. .దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 వరకు 55,07,80,273 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. నిన్న ఒకేరోజు 14,48,833 మందికి పరీక్షలు చేశామని వెల్లడిరచింది. కాగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రకియ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశారు.