Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాలనా యంత్రాంగం, ప్రజల మధ్య ప్రత్యక్ష, మానసిక అనుబంధం ఉండాలి : ప్రధాని మోదీ

అభ్యుదయ కాంక్షగల జిల్లాల్లో మన దేశం సాధిస్తున్న విజయాలకు ప్రధాన కారణం ఏకాభిముఖత, కేంద్రీకరణ ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు గల అడ్డంకులను అభ్యుదయ కాంక్షగల జిల్లాలు తొలగిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం కలిసికట్టుగా ఓ జట్టుగా పని చేస్తుండటం వల్ల ఈ జిల్లాల్లో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇతరుల ఆకాంక్షలు మన సొంత ఆకాంక్షలు అయినపుడు, ఇతరుల కలలు నెరవేరడం మన విజయానికి కొలమానం అయినపుడు, ఆ కర్తవ్య మార్గం చరిత్రను సృష్టిస్తుందని చెప్పారు. పై స్థాయి నుంచి క్రింది స్థాయికి, అదేవిధంగా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పరిపాలన ప్రక్రియ సజావుగా జరగడం కోసం పాలనా యంత్రాంగం, ప్రజల మధ్య ప్రత్యక్ష, మానసిక అనుబంధం ఉండాలని పిలుపునిచ్చారు.ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఎలాంటి ఉత్సాహంతో ఉన్నారో అదే ఉత్సాహంతో దేశ కోసం సివిల్‌ సర్వెంట్లు పని చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img