Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోలవరం నిర్వాసితులకు సీపీఐ అండ

16న అఖిలపక్షం పర్యటనలో పాల్గొంటాం
విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై కేంద్రం నియంతృత్వ చర్యలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి :
పోలవరం నిర్వాసితులకు తగిన న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా నిలబడుతుందని, ఈ నెల 16న పోలవరం ప్రాంతంలో జరిగే అఖిలపక్ష పర్యటనలో తమ పార్టీ నాయకులు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని ఆదివారం విజయవాడ దాసరిభవన్‌లో నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తితోపాటు కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ రాజకీయ పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులను నారాయణ వివరించారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. సమావేశం నిర్ణయాలను రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, ప్యాకేజీ ఇవ్వకుండా గ్రామాలను ఖాళీచేయాలని అధికారులు, పోలీసులు బెదిరించడాన్ని, బలవంతంగా ఖాళీచేయిం చేందుకు ప్రయత్నించడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యలను నిరసించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్లు, ప్రజాసంఘాలు ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మకునీరెత్తినట్లుగా ఉండడాన్ని ఖండిరచారు. మోడీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని పార్టీల కతీతంగా మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరముందన్నారు.
జగనన్న ఇళ్లు అగ్గిపెట్టెల తీరుగా ఉన్నాయని, పేదలకు ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని గతంలో చెప్పగా, ఇప్పుడు లబ్దిదారులే నిర్మాణాలు చేపట్టాలని చెప్పడం సరికాదన్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు పునాదికి మాత్రమే సరిపోతాయని, మిగిలిన నిర్మాణం కోసం ప్రజలు అప్పులు వెతుక్కోక తప్పే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక సెంటు స్థలం ఒక కుటుంబానికి ఏమాత్రం నివాసయోగ్యంకాదని తెలిపారు. పట్టణాలలో కనీసం 1.5 సెంట్లు ఇవ్వాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, జగనన్న ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వమే నాణ్యతాలోపం లేకుండా నిర్మించి, పేదలకు అందించాలని డిమాండు చేశారు. పర్యావరణకు పెను విఘాతంగా పరిణమించిన బాక్సైట్‌ తవ్వకాలను విరమించుకోవాలన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు, ఆదివాసీలు ఇప్పటికే పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధంకావాలని సీపీఐ నిర్ణయించిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలు, విభాగాలలో 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని ఆర్థిక శాఖ చెబుతోందన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న జగన్‌మోహనరెడ్డి హామీలు రెండేళ్లుగా నీటిమూటలయ్యాయని, జూన్‌ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి 10,143 ఉద్యోగాల భర్తీ కోసం అత్యంత ఆర్భాటంగా ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ పట్ల నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలు ఉద్యమబాట పట్టాయని వివరించారు. నిరుద్యోగ, యువజన, విద్యార్థులు చేపట్టిన పోరాటానికి సీపీఐ తరపున సంఫీుభావం తెలుపుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img