Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 38,353 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయి. తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.20కోట్ల మార్క్‌ను దాటింది. కరోనాతో కొత్తగా 497 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు 4,29,179 మంది మృతి చెందారు.ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,86,351గా ఉన్నాయి. తాజాగా 40,013 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,12,20,981 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img