Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

మూడువేలకు దిగువనే కరోనా కేసులు

దేశంలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతుండగా.. మరణాలు కూడా భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఆదివారం దేశవ్యాప్తంగా 2,876 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,98,938కి చేరింది. ఇందులో 4,24,50,055 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,072 మంది మైరస్‌కు బలయ్యారని, 32,811 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.72 శాతం ఉంది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,80,60,93,107 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. దేశ వ్యాప్తంగా నిన్న 7,52,818 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 78.05 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img