ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేశారు. ప్రధాని కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిరచాయి. దాదాపు 45 నిమిషాలపాటు వారి మధ్య ఫోన్ సంభాషణ సాగిందని, వారు పూర్తిగా ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితుల గురించే చర్చించుకున్నారని వర్గాలు పేర్కొన్నాయి. భారత్ సహా పలు దేశాలు ఆఫ్ఘానిస్థాన్ నుంచి తమ పౌరులను స్వదేశాలకు తరలిస్తున్నాయి. భారత్ ఆపరేషన్ దేవి శక్తి పేరుతో అఫ్ఘాన్ నుంచి భారతీయులను తీసుకొస్తున్నది.