: రజనీకాంత్
మక్కళ్ మండ్రంను రద్దు చేస్తూ ప్రకటన
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై అందరిలో ఓ ఉత్కంఠత నెలకొంది. అయితే సమావేశం అనంతరం ఓ క్లారిటీ ఇస్తూ రజనీకాంత్ ఓ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్లో పోస్టు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. అభిమాన సంఘాలతో చర్చించి ఈ నిర్ణయం వెల్లడిరచారు.రజినీ మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘నేను రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ప్రకటించిన తర్వాత, రజనీ మక్కళ్ మండ్రం పని ఏంటి? పరిస్థితి ఏంటి? అని ప్రజలు, మక్కళ్ మండ్రం నిర్వాహకులు, అభిమానుల్లో అనుమానాలు తలెత్తాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను రాజకీయ పార్టీని ప్రారంభించి, అందులో పనిచేయడానికి తగ్గట్టుగా రజనీకాంత్ రసిగర్ నర్పణి మండ్రాన్ని రజనీకాంత్ మక్కళ్ మండ్రంగా మార్చాను. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లాల స్థాయిలోనూ పలు పదవులను, పలు అనుబంధ బృందాలను ఏర్పాటు చేశాం. కానీ కాలం కలిసిరాకపోవడంతో అనుకున్నది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన నాకు లేదు. అందుకే, రజనీ మక్కళ్ మండ్రాన్ని రద్దు చేస్తున్నాను. అనుబంధ బృందాలు కూడా ఇక ఏవీ ఉండవు. ఇప్పుడు ఇందులో ఉన్న కార్యదర్శులు, అడిషనల్, జాయింట్ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులతో ప్రజల సంక్షేమం కోసం.. ఇంతకు ముందు ఉన్నట్టే రజనీకాంత్ రసిగర్ నర్పణి మండ్రం పని చేస్తుంది’’ అని తెలిపారు