దేశంలో డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధరలు మాత్రం ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోంది. సోమవారం పెట్రోల్ ధర లీటరుకు 34 పైసలు పెరగ్గా, డీజిల్ ధర 15 పైసలు తగ్గింది. కోల్కతాలో పెట్రోల్ లీటరు ధర 101.39రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గి రూ.92.86 అయింది. వివిధ నగరాలను బట్టి వేర్వేరుగా పెట్రోల్ ధర పెంపు 25 పైసల నుంచి 34 పైసలదాకా ఉంది. డీజిల్ లీటరుకు 15 పైసల నుంచి 17 పైసల వరకు తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర 101.23 రూపాయలకు పెరగ్గా.. డీజిల్ తగ్గి 89.76 రూపాయలైంది.రాష్ట్రాల వారీగా చూస్తే రాజస్థాన్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, లడఖ్, సిక్కిం, పుదుచ్చేరి, ఢల్లీిలలో పెట్రోలు ధర వందరూపాయల మార్కును దాటేసింది.