రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని నివారించేందుకు ఓ కొత్త విధానాన్ని తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముందుగా ఉత్తర రైల్వేలోని ఎనిమిది రైళ్లకు ఆ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం నూతన రైల్వే టైం టేబుల్ను కూడా రూపొందిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం, లింక్ ఎక్స్ప్రెస్, స్లీపర్ కోచ్ల సంఖ్యను స్థిరంగా ఉంచనున్నారు. దీంతో ఏ రైలుకైనా అదనంగా కోచ్లను చేర్చడం లేదా కోచ్లను తగ్గించడం లాంటివి చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం వలన సమయం ఆదా అవుతుంది. ఫలితంగా రైళ్లు నిర్ణీత సమయాలకే రాకపోకలు సాగించగలుగుతాయి.