Friday, April 26, 2024
Friday, April 26, 2024

లిక్కర్‌ స్కామ్‌ కేసులో మళ్లీ ఈడీ దాడులు

35 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు
ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేగం పెంచింది. హైదరాబాద్‌, ఢల్లీి, పంజాబ్‌లోని ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి దాడలు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన వారికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారుల బృందాలు తమ ప్రధాన కార్యాలయం నుంచి ఈ తెల్లవారుజామునే నిర్దేశిత స్థానాలకు బయలుదేరాయి. కాగా, ఈ దాడులపై ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. వీటిని ‘‘డర్టీ పాలిటిక్స్‌’’ అని విమర్శించారు. ‘‘ మనీష్‌ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను కనుగొనాలన్న ఏకైక లక్ష్యంతో మూడు నెలల నుంచి 500 కంటే ఎక్కువ దాడులు, 300 పైచిలుకు మంది సీబీఐ/ఈడీ అధికారులు 24 గంటలూ పనిచేస్తున్నారు. కానీ, ఇప్పటిదాకా ఏదీ కనుగోనలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఏ తప్పూ జరగలేదు. ఇంత మంది అధికారుల సమయాన్ని తమ నీచ రాజకీయాల కోసం వృథా చేస్తున్నారు. ఇలాంటి దేశం ఎలా పురోగమిస్తుంది?’’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img